News

డెంగ్యూ కేసులు తగ్గాయి


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 6 వారాలుగా చేసిన కార్యక్రమాలతో అద్భుత ఫలితాలొచ్చాయని, డెంగ్యూ కేసులు 1377 నుంచి 122 వరకు తగ్గాయని అన్నారు. శనివారం పచ్చదనం-పరిశుభ్రతపై అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 3.5 లక్షల దోమతెరలు పంపిణీ చేశామన్నారు. దోమల పెరుగుదల, అంటువ్యాధుల వ్యాప్తిని నియంత్రించామని తెలిపారు. అధికార యంత్రాంగం, సిబ్బంది, విద్యార్ధులు, స్వచ్ఛంద సంస్థల కృషివల్లే ఇది సాధ్యమైందని చంద్రబాబు పేర్కొన్నారు.